పవన్‌కు పర్మనెంట్‌ టీడీపీ..మిలిగినవన్నీ స్టెఫ్నీ పార్టీలు

11 Nov, 2022 13:05 IST

విశాఖ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు టీడీపీ పర్మినెంట్‌ పార్టీ అని, మిగిలినవన్నీ స్టెఫ్నీ పార్టీలేనని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. ప్రధానితో పవన్‌ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. ఎంతసేపు టీడీపీకి మేలు చేయాలన్నదే పవన్‌ ఆలోచన అని విమర్శించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు కోసమే ప్రధానిని కలిసినా ఆశ్చర్యం లేదన్నారు.