వైయస్ఆర్సీపీ మేనిఫెస్టో సమావేశం
6 Mar, 2019 10:14 IST
హైదరాబాద్: అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్సీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశం నేడు జరగనుంది. పార్టీ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. మ్యానిఫెస్టో రూపకల్పన, అందులో చేర్చాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీకి చెందిన అనుబంధ సంఘాల ప్రతినిధులతో కూడా మ్యానిఫెస్టో కమిటీ సమావేశమవుతూ సేకరించిన అభిప్రాయాలను కూడా పార్టీ అధ్యక్షుడితో చర్చించనున్నారు.