వైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావు
24 Apr, 2024 12:05 IST
శ్రీకాకుళం: ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల కీలక నేతలు పలువురు వైయస్ఆర్ సీపీలో చేరారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ విక్రాంత్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు.