తెలుగు భాష సంపదను భావితరాలకు అందజేద్దాం

29 Aug, 2019 12:10 IST

విజయవాడ: తెలుగు ప్రజలందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని నలుదిక్కులా వ్యాపింపచేసేందుకు, భాషా సంపదను భావితరాలకు అందజేసేందుకు కృషిచేద్దామని పిలుపునిచ్చారు.