శాసనసభ బీఏసీ సమావేశం ప్రారంభం
16 Jun, 2020 12:47 IST
అసెంబ్లీ: అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలి.. ప్రాధాన్యత క్రమంలో ఏయే బిల్లులను సభలో ప్రవేశపెట్టాలనే అంశంపై బీఏసీ సమావేశంలో చర్చించనున్నారు.