ఏపీలో రామరాజ్యం సాగుతోంది
18 Jan, 2021 11:36 IST
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో రామరాజ్యం సాగుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్ల నుంచి దగా కోరు రాజకీయాలు నడిచాయని విమర్శించారు. ఎవరూ ఏ కుట్ర చేసినా..దొంగలు దొరికిపోతున్నారని చెప్పారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని లక్ష్మీపార్వతి చెప్పారు.