కృష్ణా : కరోనా నివారణకు అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులను సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని మంత్రి కొడాలి నాని కోరారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో 300 మంది పారిశుధ్య కార్మికులకు మంత్రి కొడాలి నాని నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు వైయస్ఆర్సీపీ కార్యకర్తలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు.