అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పీఏగా కె.నాగేశ్వరరెడ్డి నియమితులయ్యారు. అలాగే, పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి.రవిశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు ష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2008 నుంచి వైయస్ జగన్తోనే ఉంటున్న నాగేశ్వరరెడ్డి అంతకు ముందు వివిధ పత్రికల్లో పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన వైయస్ జగన్ తన పర్సనల్ అసిస్టెంట్గా నియమించుకున్నారు.