వైయస్ఆర్ జిల్లా: మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురికావడం పట్ల దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైయస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కన్నీంటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం అనంతరం పార్థీవదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భౌతికదేహంపై కత్తిపోట్లు, తోడకు, తలకు తీవ్ర గాయాలు కావడంతో విజయమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. అలాగే బంధువులు, కుటుంబ సభ్యులు, వైయస్ఆర్ అభిమానుల రోదనలతో దద్దరిల్లుతోంది. మరికాపేపట్లో వైయస్ జగన్, వైయస్ షర్మిళమ్మ కూడా పులివెందుల చేరుకోనున్నారు.