సీఎం వైయస్‌ జగన్‌కు జర్నలిస్టులు కృతజ్ఞతలు

8 Jun, 2019 10:43 IST

అమరావతి: జర్నలిస్టుల హెల్త్‌ ఇన్సురెన్స్‌కు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతకం చేయడం పట్ల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ ఉపాధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.