అనంతపురం:వైయస్ఆర్సీపీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా ఇక్బాల్ నామినేషన్ దాఖలు చేశారు.వైయస్ఆర్సీపీ అభిమానులు,కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివెళ్ళి నామినేషన్ పత్రాలు సమర్పించారు.స్థానికుడిగా ప్రజలు ఆదరించి,ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని విశ్వాస వ్యక్తం చేశారు.బీసీలు,మైనార్టీలకు పెద్దపీట వేసిన వైయస్ జగన్ సీఎం అవ్వడం ఖాయమన్నారు.రాష్ట్రంలో ఫ్యాన్ గాలి ప్రభంజనం సృష్టించబోతుందన్నారు.