తాడేపల్లి: తిరుమల తిరుపతి దేవస్ధానం శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం శ్రీ వైయస్.జగన్ మోహన్ రెడ్డిని టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వారు సీఎం వైయస్ జగన్ను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి (ఎండోమెంట్స్) జి వాణీ మోహన్ పాల్గొన్నారు.