తాడేపల్లి: శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లిఖార్జునస్వామి వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం శ్రీ వైయస్.జగన్ మోహన్ రెడ్డిని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీశైలం కార్యనిర్వహణాధికారి లవన్న, ఆలయ అర్చకులు ఆహ్వానించారు. శుక్రవారం ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, శ్రీశైలం దేవస్ధానం కార్యనిర్వహణాధికారి లవన్న కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.