సీఎం క్యాంప్ ఆఫీస్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం
15 Aug, 2023 09:36 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ జెండా ఆవిష్కరించి వందనం చేశారు. ఈ వేడుకకు పలువురు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.