డేటా చోరీపై స్పీకర్కు నివేదిక అందజేసిన హౌస్ కమిటీ చైర్మన్ భూమన
19 Sep, 2022 17:26 IST
అమరావతి: చంద్రబాబు హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్పై శాసనసభకు హౌస్ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ మేరకు హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఫోన్ ట్యాపింగ్, డేటా చోరీపై నివేదికను స్పీకర్కు అందజేశారు. చంద్రబాబు పాలనలో డేటా చౌర్యం జరిగిందని నిర్ధారించినట్టు సమాచారం. ఈ సందర్భంగా హౌస్ కమిటీ సభ్యుడు జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ప్రాథమిక నివేదికను స్పీకర్కు అందజేశామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర విచారణ జరగాల్సి ఉందన్నారు. రేపు ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉందని జక్కంపూడి రాజా అన్నారు.