తాడేపల్లి: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. దేశాన్ని ఒకేతాటిపై నడిపించే రాజ్యాంగం ఆవిర్భవించిన రోజు నేడు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.