అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ను కలిసిన జీవీఎల్ అభినందనలు తెలిపారు. దుశ్శాలువాతో వైయస్ జగన్ను సత్కరించారు. అలాగే ిిిఇవాళ ఉదయం కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ కూడా వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.