అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల విభాగం చీఫ్ డిజిటల్ డైరెక్టర్గా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవేందర్ రెడ్డి ఎన్నికల సమయంలో వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్గా పార్టీకి విస్తృత ప్రచారం కల్పించారు. దేవేందర్రెడ్డి ఎన్నిక పట్ల పలువురు అభినందనలు తెలిపారు.