తాడేపల్లి: టీడీపీ నేత, రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో చందన రమేష్, ఆయన తనయుడు నాగేశ్వర్ వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు చందన్ రమేష్, ఆయన కుమారుడు నాగేశ్వర్కు సీఎం వైయస్ జగన్ వైయస్ఆర్ సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు.