వైయస్ జగన్ను కలిసిన పీసీసీ మాజీ చీప్ శైలజానాథ్
18 Dec, 2024 19:03 IST
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కలిశారు. కర్నూలులో వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్కు హాజరైన సందర్భంలో వైయస్ జగన్ను ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు.