చంద్రబాబుది అతి నీచమైన, దుర్మార్గమైన సంస్కృతి
తాడేపల్లి: చంద్రబాబుది అతి నీచమైన, దుర్మార్గమైన సంస్కృతి అని వైయస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. అలాంటి వ్యక్తితో రాజకీయాలు చేయడం మా దురదృష్టమని అన్నారు. విషపు రాతలతో ఒక పుస్తకాన్ని అచ్చెసి బయటకు వదిలారని, రాజకీయాల్లోకి ఆడవాళ్లను కూడా లాగి వివాదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ పుస్తకంపై టీడీపీ, చంద్రబాబు పేర్లు పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు ఓ పిరికిపంద అని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
వయసు మీరిన అజ్ఞాని బాబు:
జగనాసుర రక్తచరిత్ర.. అంటూ 25 పేజీలతో టీడీపీ అన్నీ అసత్యాలు, అవాస్తవాలతో ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. వయసు మీద పడిన బాబు ఒక అజ్ఞాని అని ఈ పుస్తకం నిరూపిస్తోంది. పైగా దాన్నెవరు ప్రచురించారు? ఎన్ని కాపీలు వేశారు? అన్న కనీస వివరాలు లేకుండా.. తమదేదో అంతర్జాతీయ పార్టీ అయినట్లు.. ‘విగ్రహపుష్టి నైవేద్యనష్టి’ వంటి బుర్ర లేని పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో విడుదల చేయడం మరో తమాషా.
నిజంగా దమ్ముంటే ఎవరు ప్రచురణకర్త, ఎక్కడ, ఎన్ని కాపీలు ముద్రించారు వంటి పూర్తి వివరాలు అందులో ఉటంకించాలి కదా చంద్రబాబూ? అంత పిరికిపందవా నువ్వు? మీరు పుస్తకంలో రాసినవే కనుక నిజాలైతే పేర్లెందుకు వేసుకోలేదు పిరికిగొడ్డూ...?
నిజాలను ఏమార్చలేరు:
ఆ పుస్తకంలో మీరు రాసినవన్నీ అసత్యాలని మీకూ తెలుసు.. జగన్గారి వ్యక్తిత్వ హననానికి మీరెన్ని అసత్యాలు రాసినా ఆయన ప్రతిష్టను , నిజాలను ఏమార్చలేరు. అవి తప్పుడు రాతలని, విషపు రాతలని చంద్రబాబే ఒప్పుకుంటున్నాడు. ఈ పుస్తకంలో బాబు చేసే ఆరోపణలు ఎంత నీచమైనవి అంటే రాజకీయాల్లో బాబు లాంటి దిగజారిన వ్యక్తులు ఎలాంటి అబద్ధాలు ఆడతారో స్పష్టంగా తేటతెల్లం చేశాయి.
అప్పుడు మీ ప్రభుత్వం ఏం చేసింది?:
వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు సీఎం ఎవరు? ప్రభుత్వం ఎవరిది? నువ్వేం చేశావు. ఆ తప్పుడు రాతల విషం చిమ్మే బదులు.. వివేకానందరెడ్డి కుమార్తెను, భార్యను, అల్లుణ్ని.. ఊళ్లో ఉన్న ఆయన కుటుంబాన్ని ఎందుకు విచారించలేదు? అప్పుడున్నది మీ ప్రభుత్వమే కదా?.
ఆ పనులెందుకు చేయలేదు?:
ఎంపీ అవినాష్రెడ్డి ఆనవాళ్లు చెరిపించాడంటే నువ్వు, నీ డీజీపీ. ఏబీ వెంకటేశ్వరరావు, పోలీసులు ఏం చేశారు? ఒకవేళ మీ విషపురాతలే నిజమనుకుంటే.. ఇసుక పంచాయతీలు, పంపకాలు, కమీషన్లు వసూలు చేసే మీ పోలీసు చుట్టం ఏం చేశాడు? ఆ హత్య జరిగినప్పుడు మీ పోలీసు ఏమయ్యాడు? ఆ రోజు వివేకానందరెడ్డి కుమార్తె వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు. ఎఫ్ఐఆర్లో జగన్గారి పేరు, ఎంపీ అవినాష్రెడ్డి పేర్లు ఎందుకు రాయలేదు? శవపంచనామా సమయంలో కూతురు, అల్లుడు, భార్య, వివేకానందరెడ్డికి ఊళ్లో ఉన్న భార్య, ఉళ్లో ఉన్న కొడుకు వాంగ్మూలాలు ఎందుకు తీసుకోలేదు?
నిజంగా సాక్ష్యాలు చెరిపేస్తే..:
ఎంపీ అవినాష్ ఆ సాక్ష్యాలను, ఆనవాళ్లను చెరిపేశారంటున్నావు కదా.. మరి నువ్వు అప్పుడు కేసు ఎందుకు పెట్టలేకపోయావు? కేసు డైరీ రాసే క్రమంలో, ప్రాథమిక దర్యాప్తులో, పాక్షిక ఛార్జిషీట్లో అవినాష్ పేరు ఎందుకు చేర్చలేదు? వివేకానందరెడ్డి హత్య జరిగింది 2019 మార్చిలో. ఆ ఏడాది మే 30 వరకు జగన్ గారు ముఖ్యమంత్రిగా లేనేలేరు. మార్చి– మే మధ్యలో నువ్వే సీఎంవి. నీ ప్రభుత్వమే ఉంది. మరి అప్పుడెందుకు దర్యాప్తు చేయలేకపోయారు. నీది చేత కాని ప్రభుత్వమా? లేక తప్పుడు ప్రభుత్వమా?
ఆనాడు హరికృష్ణ కోరినా..:
ఇన్ని పత్తిత్తు కబుర్లు చెబుతున్నావు. ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన కొడుకు హరికృష్ణ తన తండ్రి మరణంపై సీబీఐ దర్యాప్తు కోరితే నువ్వు సీఎంగా కనీసం సీబీసీఐడీ దర్యాప్తు అయినా చేయించావా? ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కూడా అడిగింది కదా? తన భర్త మరణంపై అనుమానాలున్నాయని, ఎన్టీఆర్ మరణానికి నీవే కారకుడివని చెప్పినా, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కోసమైనా దర్యాప్తు చేయించావా? మరి అప్పుడూ పుస్తకం వేయించాలిగా. ఎందుకు వేయించలేదు?.
అక్కడ నీ మనుషులున్నారా?:
అవినాష్ రెడ్డి సీబీఐకి ఇచ్చారని నువ్వు చెబుతున్న వాంగ్మూలం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? సీబీఐ దర్యాప్తు సమయంలో ఏం చెప్పకపోయినా పోలీసులో, డీఎస్పీనో ఏదో ఒక వాంగ్మూలం రాసుకుని, దాన్నే ప్రచారం చేస్తున్నారు. అలాంటి కాగితం నీ వద్దకు వచ్చిందంటే సీబీఐలో నీ మనుషులు, నీ కీలుబొమ్మలున్నారని, వారిని లొంగ దీసుకుని, రాజకీయాల కోసం నువ్వు వ్యాపారం నడుపుతున్నావని అనుకోవాలి. దీన్ని బట్టి సీబీఐ బాబు ఆదేశానుసారం నడుస్తోందని భావించాలి. ఆ స్టేట్మెంట్ నువ్వు అచ్చేయగలిగావంటే నీ మార్గనిర్దేశకత్వంలో సీబీఐ నడుస్తోందనుకోవాలి.
మూడు నెలలు గడిచినా..:
వివేకా హత్య తర్వాత మొదటి గంటలో, లేదా ఒక వారం, లేదా నెల కేసు దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ పూర్తి కావాలి కదా. కానీ మూడు నెలలు, అంఏ ఏకంగా 90 రోజులు గడిచినా నీ ప్రభుత్వంలో కేసు కదల్లేదు కదా? ఒకవేళ నువ్వు రాసిందే నిజమైతే ఎందుకు అవినాష్ను ముద్దాయిని చేయలేదు. ఎందుకు రద్యాప్తు చేయలేదు. సాక్ష్యాధారాలు ఎందుకు సేకరించలేదు.
కోడెల మరణంపై ఏదీ పుస్తకం?:
నీ పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు బలవన్మరణంపై పుస్తకం ఎందుకు వేయలేదు? 2019లో కోడెల బలవన్మరణం పొందితే అప్పుడు పుస్తకం ఎందుకు వేయలేదు? అప్పుడు ఆ మరణం వెనుక నీ ప్రమేయం లేకపోతే నిజాయితీగా కోడెల ఫోన్ను తెలంగాణ పోలీసులకు ఎందుకివ్వలేదు? ఆ ఫోన్ను ఏం చేశారు?. ఆయన మరణానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే బాధ్యత అని ఆరోపించావు కదా!
ఆ ఫోన్లో బాబు రాజకీయ క్రీడలో తాను బలైపోయానని, బాబు తనను మానసికంగా కుంగదీసినందువల్లే చనిపోతున్నట్లు కోడెల వాంగ్మూలం ఆ ఫోన్లో ఉందా? ఆ ఫోన్ను ఎందకు దహనం చేశారు? ఎందుకు ధ్వంసం చేశారు? దానిపైనా పుస్తకం వేయాలి కదా? ఆ కేసులోనూ సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరలేదు? అదే జరిగితే నీ పాపాలు బయటికొస్తాయి కాబట్టి నీవా పని చేయలేదు.
ఆమె మరణంపైనా..:
ఎన్టీఆర్ కుమార్తె మరణంపైనా సీబీఐ దర్యాప్తు వేయాలి కదా? ఎన్టీఆర్ కుమార్తె ఒకరు పేరు అనవసరం. ఈమధ్య చనిపోయారు. దానిపై కూడా సీబీఐ దర్యాప్తు వేయాలి. దానిపై కూడా ఒక పుస్తకం
అచ్చు వేయాలి. ఎన్టీఆర్ పతనం, కుట్ర, కుతంత్రం, వెన్నుపోటు, వీటిపై పుస్తకం వేయాలిగా. చివరికి ఎన్టీఆర్కు నిలువ నీడ లేకుండా చేశారు. ఆయన్ను మానసికంగా కుంగదీసి, ఆయన ఉంటున్న ఇంటిని కూడా కుటుంబ సభ్యులు లాక్కునేలా చేసినందుకు దానిపైనా సీబీఐ దర్యాప్తు వేయాలిగా.
జగన్గారు చలించరు:
జగన్ గారు ప్రజలను, దేవుడిని నమ్ముకుంటారు కనుక నీలాంటి వాళ్లు ఎన్ని కుతంత్రాలు చేసినా దేవుడు చూసుకుంటాడని వివేకానందరెడ్డి హత్య కేసులో నిజానిజాలు బయటికి రావాలని, పారదర్శకంగా దర్యాప్తు జరగాలని ఆశించి సీబీఐ దర్యాప్తును కోరారు. నువ్వెంత నీచుడవంటే భారతమ్మ గారి ఫొటో పుస్తకంలో ప్రచురిస్తావా? 23 మంది ఎమ్మెల్యేలను కొన్నా, జగన్ గారిని మానసికంగా కుంగదీయలేకపోయావు.
నీ ఇంట్లో వారే ఆడవాళ్లా. ఇతర కుటుంబాల్లోని ఆడవాళ్లకు ఆత్మాభిమానం, పరువు ప్రతిష్టలు ఉండవా? ఏం నీచపు బుద్ధి నీది? నువ్వెన్ని నీచాలకు పాల్పడినా, జగన్గారు చలించడం లేదని బీజేపీ నాయకులు, నువ్వు దత్తత తీసుకున్న వారితో అవాకులు చవాకులు మాట్లాడిస్తున్నావు.
నీ స్వార్థం కోసం..:
ఎక్కడో యూట్యూబ్లో నీ భార్యను ఎవరో ఏదో అన్నారంటూ.. బోరుబోరున అసెంబ్లీలో నువ్వు ఏడ్పులు. నీ భార్యను ఏమీ అనకపోయినా రాజకీయ సానుభూతి కోసం ఆమెను కూడా అసెంబ్లీలోకి లాక్కొస్తావు. నీకు వయసొచ్చింది. రావిచెట్టుకు, మనకూ వయసోస్తోంది. నీ సంస్కారం ఇదా? రాజకీయాల కోసం ఎదుటి వారింట్లో ఆడవారిని కూడా బజారుకు తెస్తావు. నీకు సిగ్గులేదు.. నీ నీచ సంçస్కృతి, కిరాతక సంçస్కృతికి, ఇంత నీచుడితో, ఇంత హేయమైన రాజకీయ నాయకుడితో పోటీగా రాజకీయాలు చేయడం తమ దురదృష్టకరమని భావిస్తున్నాం.
ఎలాంటి వెధవను కన్నావు బాబూ?:
సాధారణంగా ఎవరైనా చెడిపోతే ఏం పెంపకంరా అంటాం. నా కొడుకు చెడిపోతే నన్ను కాదా అనాల్సింది.పెంపకం నాదే కదా. చెడిపయిన చంద్రబాబు కొడుకు పెంపకం ఎవరిది. బాబుదే కదా. బాబు కొడుకు అరేయ్.. ఒరేయ్.. తురేయ్.. అంటుంటే ఎవరిని అనాలి. బాబునే కదా. మూడు సార్లు ఎమ్మెల్యే చేసిన వారిని రెండు సార్లు ఎంపీలు చేసిన వారిని కూడా లోకేశ్ ఏరా అంటున్నాడు. ఎంపీల తమ్ముళ్లను, మాజీ ఎంపీల తమ్ముళ్లను సైతం ఏరా, ఒరేయ్ అంటున్నాడు. మీ అందరి సంస్కారం అది.
కానీ గౌరవ సీఎంగారిని కూడా అలాగే సంబోధిస్తే..ఏరా సన్నాసి బాబూ ఇలాంటి వెధవను కన్నావు? ఏంట్రా బాబుగా అని మేమనలేమా?
ముందు బాబును తన్నాలి:
తప్పుడు పెంపకానికి ముందు బాబును తన్నాలి. కొడుక్కి బాషా సంస్కృతి నేర్పనోడిని ఏమనాలి. లోకేశ్తో ఓనమాలు దిద్దించేటప్పుడు సంస్కారం లేని బాబు దిద్దించి ఉంటాడు. అందుకే ఇలా చేతకానోడు అయ్యాడు. ఈ కొడుక్కి అవేవీ లేవు. పాపం లోకేశ్ కొడుకును నేనేమీ అనడం లేదు. మంచిగానే ఆశీర్వదిస్తాను. మంచిగా ఉండాలంటాను. దిగజారి బతుకుతున్నారు. తండ్రి చెడిపోయినోడు అయితే కొడుకూ అలాగే తయారవుతాడు.
తెలుగుకు తెగులు పట్టిస్తున్న లోకేశ్:
లోకేశ్ తన కొడుకుతో ఓనమాలు దిద్దిస్తున్న దృశ్యం నాకు ఫోన్లో కనిపించింది. పక్కన పంతులు గారు ఆంధ్రప్రదేశ్ అని రాయించమంటే లోకేశ్ ఆ రాసి.. తర్వాత సున్నాకు బదులుగా న్.. అని రాస్తున్నాడు.
మామయ్యా.. లోకేశ్ తప్పులు రాస్తున్నాడని బాలకృష్ణ కుమార్తె మొత్తుకుంటోంది. చదువు సంధ్యలు లేనోణ్ని బాబు ఊరి మీదికి వదిలాడు. ఇలాంటోణ్ని కన్న బాబును అనాలి.
కోడ్ ఉల్లంఘించడం తప్పు కాదా?:
ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో నేరాలు జరిగితే పోలీసులు కేసులు పెట్టరా? అరెస్టులు చేయరా? శప పంచాయతీలు జరగవా? శవ పంచనామా చేయరా? వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా అరెస్టులు చేశారు కదా. సాక్ష్యాధారాలు ధ్వంసం చేస్తే ఊరుకుంటారా? వివేకా కుమార్తె, అల్లుడు స్టేట్మెంట్ తీసుకోవాలి కదా. కేసు కట్టాలి కదా.
నీ ప్రభుత్వంలో ఎన్నికలకు – ఓట్ల లెక్కింపు వ్యవధి మధ్యలో ఆ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. కోడ్ ఉంటే కాంట్రాక్టర్లకు ఎలా పాస్ చేశారు. టెండర్లు ఇచ్చారు కదా. తప్పుకోవడానికి, తప్పుడు మాట్లాడడానికి ఆడలేక మద్దెల ఓడు అనడానికి, ఈత చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లు.. ఇలాంటి అడ్డగోలు మాటలు బాబు మాట్లాడుతున్నాడు.
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎఫ్ఐఆర్ కట్టారు. శవ పంచనామా చేశారు. మరి కేస్డైరీలో ఏం జరిగిందో ఊండాలిగా. అంటే కేసును మీరు మాఫీ చేశారా?
టీడీపీకి పబ్లిసిటీ పిచ్చి ఉంది. రోజూ ఏదో ఫొటోతో వార్తలు రావాలని ఆ పార్టీ నాయకులు తపన పడతారు. అందుకే ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూలి తీసుకోకుండా రాసే వాళ్లున్నారు... డబ్బంటే చంద్రబాబు ఇస్తాడు ..లోకేశ్ అటో కాలు...ఇటో కాలు.. నడ్డి ఒకవేపు వేసి నడుస్తున్నాడుగా. పారాచ్యూట్ ధర పెరిగిందని, ఆయిల్ ఖర్చు పెరిగిందని, ఏడ్వాలి గాని...నా ఇష్టమొచ్చినట్లు సందుల్లో గొందుల్లో మీటింగులు పెట్టాలంటాడు. పోలీసులు ఊరుకుంటారా?
మాపై ఏడుపెందుకు?:
కోర్టులో జీవో1ను బినామీలోతో కేసు వేస్తే కొట్టేసింది... జెండాలు కట్టడానికి తమిళనాడు నుంచి కూలీలను తెచ్చుకుంటున్నారు. అచ్చెన్నాయుడు బతుకు ఇది. ఖర్చెక్కువై పోతోందని పాదయాత్రను ఆపేయాలనుకుంటే ఆపేసుకోవాలి కాని మా ప్రభుత్వంపై ఏడ్వడం అనవసరం. మేమేమీ అతని పాదయాత్రకు అడ్డం పడడం లేదు. .జనం రావడం లేదని ఏడ్వాలి ...గవర్నర్ వద్దకు వెళ్లి ఎందుకు ఏడ్పులు.. టెలికాన్ఫరెన్పు పెట్టి జనం లేరని బాబు బాధపడుతున్నారని అచ్చెన్నాయుడు తెగ బాధపడిపోతున్నారు. పప్పు సుద్ద లోకేశ్ స్థాయి మరిచిపోయి జగన్గారిపై నిందలా... ముందు మాట్లాడడం నేర్చుకో... బూతులు లేకుండా మాట్లాడు...
బాబు మీటింగులకు యనమల చార్టర్ విమానాలు పెట్టాడా? బాబు దగ్గర నెలజీతానికి పనిచేస్తున్నాం కదా...అని యనమల ఎలా పడితే అలా మాట్లాడుతంటాడు. ఈయన తమ్ముడు కృష్ణుడు చెబుతాడు యనమల బతుకు గురించి..ప్రభుత్వం మారే సరికి వంద కోట్లు మిగిల్చిపోయినోళ్లు పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు.
భారత దేశంలోనే చదువుకు అత్యంత ప్రాధాన్యామిచ్చి, చదువుపై పెట్టే పెట్టుబడి ఈ దేశంపైనే పెట్టుబడి పెడుతున్నామన్న రీతిలో చేస్తున్న అసాధారణ ప్రజ్ఞాశాలి మా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్రెడ్డి గారు.
రాష్ట్రంలో ఈ రోజు 46 వేల పాఠశాలల స్వరూపాన్ని మారుస్తున్నది జగన్ గారు. ఇందులో ఇప్పటికే 20వేల పాఠశాలలకు సరికొత్త రూపమిచ్చారు. ఎన్నికల నాటికి మొత్తం 46 వేల పాఠశాలలు సరికొత రూపంలో దర్శనమిస్తాయి. ఓటేసే ప్రజలే సంభ్రమాశ్యర్యాలకు గురయ్యే రీతిలోఅద్భుతంగా తయారవుతాయి. విద్యార్థుల్లో ఆత్మస్థయిర్యాన్ని నెలకొల్పి, ఉన్నత సాంకేతిక విలువలతో నాణ్యమైన చదువులు అందించడంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని ఈ రోజు ఇతర రాష్ట్రాలే కొనియాడుతున్నాయి. ముందు యనమల తన ఊళ్లోని తన హయాంలోని పాఠశాల ఇప్పుడెలా రూపురేఖలు మారిందో చూసుకుని మాట్లాడాలని హితవు పలుకుతున్నాను..
ప్రత్యేకహోదా గురించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యల గురించి ఒక ప్రశ్నకు సమాధానంగా ఆ రోజున పార్లమెంటులో మన్మోహన్ సింగ్, మోదీలతో అయిదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగి సన్మానాలు చేయించుకున్న వ్యక్తిని ఆ డ్రామా మాటలు ఈ రోజు ఏమయ్యాయని పేర్ని అడిగాడని మీరే ఆయన్నడగండని అన్నారు.
-