రాష్ట్ర ప్రజలందరికీ శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఉండాలి
10 Jan, 2025 10:38 IST
తాడేపల్లి: రాష్ట్ర ప్రజలందరికీ శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఉండాలని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
‘రాష్ట్ర ప్రజలందరికీ శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఉండాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ’ అని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.