వరుసగా ఐదో ఏడాది వైయస్ఆర్ మత్స్యకార భరోసా
16 May, 2023 10:35 IST
తాడేపల్లి: వరుసగా ఐదో ఏడాది వైయస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా వేట నిషేధ భృతిని అందించేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. నేడు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో మత్స్యకార భరోసా సాయాన్ని జమచేయనున్నారు. మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్జీసీ పైపులైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని జమచేయనున్నారు.