సీఎం వైయస్ జగన్ను కలిసిన ప్రవాసాంధ్రులు
25 May, 2022 16:33 IST
దావోస్: స్విట్జర్లాండ్లోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు సీఎం వైయస్ జగన్ను దావోస్లో కలిశారు. ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని కితాబిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో చక్కటి కృషిచేస్తున్నారన్నారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని సీఎం వైయస్ జగన్కు ప్రవాసాంధ్రులు కృతజ్ఞతలు తెలిపారు.