విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ క్యాలెండర్, డైరీల ఆవిష్కరణ
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీలను మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల సేవలను ఆయన ప్రశంసిస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు జి. మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డిపి. వెంకటరమణ పాల్గొన్నారు. అలాగే ఏపీఎస్పీడీసీఎల్ అధ్యక్షుడు ఎన్.వి. సుధాకర్ రెడ్డి, ఏపీసీపీడీసీఎల్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, సోమశేఖర్ రెడ్డి, ఏపీఈపీడీసీఎల్ అధ్యక్ష, కార్యదర్శులు ఏవి. సత్యనారాయణ, లక్ష్మీరావు తదితర యూనియన్ నాయకులు హాజరయ్యారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు వైయస్ఆర్సీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.