తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా (ఏవీఎస్ఎమ్, వైఎస్ఎమ్, విఎస్ఎమ్) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తాను సీఎం వైయస్ జగన్ సన్మానించి.. శ్రీవేంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. తూర్పు సముద్ర తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను అధిగమించేందుకు భారత నావికాదళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్కు వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా వివరించారు.
డిసెంబర్ 4న ఇండియన్ నేవీ డే సందర్భంగా విశాఖలో జరిగే వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా ఆహ్వానించారు. అదేవిధంగా సీఎం వైయస్ జగన్కు ఐఎన్ఎస్ విక్రాంత్ మోడల్ను బహుకరించారు. ఈ సందర్భంగా సీఎంని కలిసిన నేవీ ఉన్నతాధికారుల్లో కెప్టెన్ విఎస్సి రావు (సివిల్ మిలటరీ లైజన్ (అడ్వైజరీ), కెప్టెన్ అభిషేక్ కుమార్, లెఫ్టినెంట్ పీఎస్. చౌహాన్ ఉన్నారు.