తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైయస్ఆర్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా ఆర్. ధనుంజయ్రెడ్డి నియమితులయ్యారు. జనవరి 5వ తేదీన ప్రకటించిన పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుల ప్రకటనను పాక్షికంగా సవరిస్తూ ధనుంజయ్రెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షులుగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదలైంది.