సీఎం వైయస్ జగన్ను కలిసిన దేవెగౌడ మనవడు నిఖిల్
11 Jun, 2019 13:50 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిఖిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.