విశాఖపట్నం: ఇటీవల జరిగిన విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధులుగా గెలుపొందిన ముగ్గురు కార్పొరేటర్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖ నగరం తిమ్మాపురంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యులు వి.విజయసాయి రెడ్డి సమక్షంలో జీవీఎంసీలోని 32, 35, 39వ వార్డులకు చెందిన స్వతంత్ర కార్పొరేటర్లు కందుల నాగరాజు, విల్లూరి భాస్కరరావు, మహమ్మద్ సాధిక్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయసాయి రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరి చేరికతో కార్పొరేషన్లో వైయస్ఆర్సీపీ బలం 61కి పెరిగింది.
అలాగే జీవీఎంసీ మాజీ కార్పొరేటర్, జనసేన నాయకుడు మువ్వల పోలారావు, టీడీపీ నాయకుడు సూరిశెట్టి లక్ష్మణ్ కూడా పార్టీలో చేరారు. వైయస్ఆర్ సీపీ నుంచి సస్పెన్షన్కు గురైన తాతారావును కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విశాఖ నగరంలో పార్టీని మరింత బలోపేతం చేసే కార్యాచరణపై వారితో చర్చించడం జరిగింది. సమావేశంలో పార్టీ నగర శాఖ అధ్యక్షుడు వంశీ కృష్ణ యాదవ్, విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ పరిశీలకుడు కేకే రాజు పాల్గొన్నారు.