విజయనగరం: డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా సోకింది. కోవిడ్ పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే విధంగా పుష్పశ్రీవాణి భర్త, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షుడు పరిక్షిత్ రాజు కూడా కరోనా బారినపడ్డారు.