వైయ‌స్‌ వివేకానంద‌రెడ్డి అంతిమ యాత్ర ప్రారంభం

16 Mar, 2019 10:25 IST

 పులివెందుల: మాజీ మంత్రి వైయ‌స్‌ వివేకానందరెడ్డి అంతిమ యాత్ర ప్రారంభ‌మైంది. ఆయ‌న భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి భారీగా జనం తరలివచ్చారు. ‘అజాత శత్రువు’ను కడసారిగా చూసేందుకు బంధువులు, సన్నిహితులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. సజల నేత్రాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరీ తరం కావడం లేదు. ఊహించని దారుణంతో వైయ‌స్ఆర్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

వైయ‌స్‌ వివేకానందరెడ్డి పార్థీవదేహం వద్ద ఈ ఉదయం కుటుంబ సభ్యులు ప్రార్థనలు నిర్వహించారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత అంతిమయాత్ర ప్రారంభ‌మైంది.  వైయ‌స్‌ రాజారెడ్డి సమాధి పక్కనే వివేకానందరెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.