సర్ధార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం వైయస్ జగన్ ఘన నివాళులు
15 Dec, 2023 12:26 IST
తాడేపల్లి: భారతరత్న సర్ధార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. సచివాలయంలో వారి చిత్రపటాలకు సీఎం వైయస్ జగన్ పూలు సమర్పించి నివాళులర్పించారు.
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.