నేడు విజయవాడలో సీఎం వైయస్ జగన్ పర్యటన
21 Aug, 2023 11:04 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) 21వ రాష్ట్ర మహా సభలకు సీఎం వైయస్ జగన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభల్లో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.