వైయస్ఆర్ సీపీ ఎంపీలతో సీఎం వైయస్ జగన్ సమావేశం
17 Mar, 2023 12:42 IST
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అనంతరం ఢిల్లీలోని వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రరాష్ట్రానికి హక్కుగా రావాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలతో సీఎం వైయస్ జగన్ చర్చిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు.