ప్రధాని మోడీతో ముగిసిన సీఎం వైయస్ జగన్ భేటీ
17 Mar, 2023 12:30 IST
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. పార్లమెంట్ ఆవరణలోని పీఎం కార్యాలయంలో ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం వైయస్ జగన్.. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. ఈ సమావేశంలో సీఎం వైయస్ జగన్ వెంట వైయస్ఆర్ సీపీ ఎంపీలూ ఉన్నారు.