ప్ర‌ధానితో ముగిసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

22 Aug, 2022 11:19 IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీతో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి భేటీ ముగిసింది. ఈ భేటీ సందర్బంగా పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రధానిని సీఎం వైయ‌స్‌ జగన్‌ కోరారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని తర్వితగతిన ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోడీతో సీఎం వైయ‌స్‌ జగన్‌ చర్చించారు.