తాడేపల్లి: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్కు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. బహ్రెయిన్లోని ఓ ప్రైవేట్ సంస్థ యాజమాన్యం చేతిలో చాలామంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది ఏపీకి చెందిన వారు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు.