తిరుపతి: అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యమని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. 29 గ్రామాల కోసం చంద్రబాబు 5 కోట్ల మందిని విస్మరించారని విమర్శించారు. అమరావతి రైతుల ముసుగులో చంద్రబాబు అనుచరులు పాదయాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు వెనుకబడి ఉన్నాయని భూమన తెలిపారు.