ఏపీకి 60 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపించాలి
తాడేపల్లి: ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రానికి 60 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. టీకా ఉత్సవ్లో భాగంగా ఒక్కరోజే 6,28,961 డోసులు ఇచ్చామన్నారు. ఈ విషయంలో ఏ రాష్ట్రంతో పోల్చినా ఏపీలోనే ఎక్కువ డోసులు ఇచ్చామన్నారు. ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఇది సాధ్యమైందని సీఎం వైయస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. ప్రతి 50 కుటుంబాల అవసరాలను ఒక వాలంటî ర్ తీరుస్తున్నారని చెప్పారు. వ్యాక్సిన్ డ్రైవ్ను ఏపీలో వాలంటీర్లు సమర్థంగా చేపట్టారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతీ వ్యక్తికి వ్యాక్సిన్ అందేలా చూస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే మూడు వారాల్లో ఏపీలో 45 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తున్నామని చెప్పారు. ఆ లక్ష్య సాధన కోసం ఏపీకి 60 లక్షల డోసులు కేటాయించాలని సీఎం వైయస్ జగన్ ప్రధాని మోదీని కోరారు.