రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
11 Mar, 2021 11:23 IST
తాడేపల్లి: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘విశేష పూజలు, జాగరణతో ఓంకారస్వరూపుడైన శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి. ఈ విశిష్ట పర్వదినాన పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు’ తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు.