రేపటి నుంచి మూడు రోజుల పాటు సీఎం వైయస్ జగన్ విశాఖపట్నం పర్యటన
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో సీఎం వైయస్ జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు.
02.03.2023 షెడ్యూల్
సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, రాత్రికి అక్కడే బస
03.03.2023 షెడ్యూల్
ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్కు చేరుకుని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పాల్గొంటారు. రాత్రి 8.00 – 9.00 ఎంజీఎం పార్క్ హోటల్లో జీఐఎస్ డెలిగేట్స్కు ఏర్పాటుచేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు, అనంతరం రాత్రి బస
04.03.2023 షెడ్యూల్
ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్కు చేరుకుని రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.