రేపు యలమంచిలిలో సీఎం వైయ‌స్‌ జగన్‌  పర్యటన

4 Jan, 2023 22:17 IST

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రేపు అన‌కాప‌ల్లి జిల్లా య‌ల‌మంచిలిలో ప‌ర్య‌టించ‌నున్నారు. విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు కుటుంబాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్  పరామర్శించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 12.00 గంటలకు యలమంచిలిలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైయ‌స్సార్‌సీపీ సమన్వయకర్త అడారి ఆనంద్‌ నివాసానికి చేరుకుంటారు. ఆయన తండ్రి, విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.