గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొననున్న సీఎం వైయస్ జగన్
25 Jan, 2023 12:21 IST
తాడేపల్లి: రేపు (26.01.2023, గురువారం) విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. గురువారం ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్. రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొననున్న సీఎం, అనంతరం తాడేపల్లి నివాసానికి తిరుగు పయనం అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ఆతిధ్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారు.