కేంద్రమంత్రి షెకావత్‌తో భేటీ కానున్న సీఎం వైయస్‌ జగన్‌

27 May, 2023 16:22 IST

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ 8వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల వ్యయం నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రిని సీఎం వైయస్‌ జగన్‌ కోరనున్నారు.