దేవుడే శిక్షిస్తాడు

31 Dec, 2020 12:40 IST

తాడేపల్లి:  దేవుడితో చెలగాటమాడితే..ఆ దేవుడే శిక్షిస్తాడని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హెచ్చరించారు. దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంపై సీఎం వైయస్‌ జగన్‌ సీరియస్‌ అయ్యారు. విగ్రహాల విధ్వంసం ఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.