విశాఖ: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పరిమళ్ నత్వానీతో కలిసి దిగ్గజ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ విశాఖకు చేరుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో జీఐఎస్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్న అంబానీకి ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు అమర్నాథ్, విడదల రజిని, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖేష్ అంబానీకి ఆత్మీయ స్వాగతం పలికారు.