తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనకు బయల్దేరారు. ఈరోజు ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం వైయస్ జగన్ మరికాసేపట్లో నర్సీపట్నం మండలం బలిఘట్టం చేరుకుంటారు. అనంతరం జోగునాథునిపాలెం వద్ద నర్సీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన, తాండవ–ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత మ.1.25కు తిరుగు ప్రయాణమై తాడేపల్లి తన నివాసానికి చేరుకుంటారు.