రేపు సీఎం వైయస్ జగన్ విజయవాడ పర్యటన
28 Sep, 2023 10:40 IST
తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 29న (శుక్రవారం) విజయవాడలో పర్యటించనున్నారు. విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్లో వైయస్ఆర్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళ్తారు. బహిరంగ సభలో ప్రసంగించి తాడేపల్లికి చేరుకుంటారు.