రేపు సీఎం వైయస్ జగన్ విజయవాడ పర్యటన
16 May, 2023 17:17 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (17.05.2023) విజయవాడలో పర్యటించనున్నారు. శ్రీ లక్ష్మీ మహ యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొననున్నారు. ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంకు చేరుకుని శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి, అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.