అక్టోబర్‌ 2న తూ.గో జిల్లాలో సీఎం పర్యటన

30 Sep, 2019 17:56 IST

తాడేపల్లి: అక్టోబర్‌ 2వ తేదీన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అక్టోబర్‌ 2వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం వైయస్‌ జగన్‌ కరప చేరుకుంటారు. కరపలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభిస్తారు. కరపలో పైలాన్‌ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.